Blog

హోలీ ఒక్కసారే వస్తుంది, కానీ నమాజ్ ప్రతి వారం – యోగి ఆదిత్యనాథ్

Published

on

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం సంభల్ పోలీసు అధికారిని సమర్థిస్తూ మాట్లాడారు. ఆ అధికారి చేసిన వ్యాఖ్యల ప్రకారం, హోలీ పండుగ సంవత్సరం‌లో ఒక్కసారి వస్తుంది, కానీ శుక్రవారం నమాజ్ ప్రతి వారం ఉంటుంది.

మార్చి 6న సంభల్ పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం జరిగింది. హోలీ ఈ సంవత్సరం మార్చి 14న రంజాన్ సమయంలో శుక్రవారం నమాజ్‌ రోజున వస్తుండటంతో, సమాజంలో శాంతి ఉంటేలా చర్చించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి అనుజ్ చౌదరి ముస్లిం సోదరులకు సూచిస్తూ, “హోలీ రంగుల పండుగ కేవలం ఒక్కరోజే ఉంటుంది, కానీ శుక్రవారం నమాజ్ సంవత్సరంలో 52సార్లు వస్తుంది. ఎవరికైనా హోలీ రంగులు తగలడం ఇష్టం లేకపోతే, వేడుకలు ముగిసే వరకు ఇంట్లోనే ఉండడం మంచిది” అని అన్నారు.

ఇండియా టుడే కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆ పోలీసు అధికారి ఒక రెజ్లర్‌ గా మాట్లాడి ఉండొచ్చని అన్నారు. అనుజ్ చౌదరి ఒక మాజీ రెజ్లర్, అర్జున అవార్డు గ్రహీత కూడా. అలాగే, శుక్రవారం నమాజ్‌ను మధ్యాహ్నం 2 గంటల తర్వాత నిర్వహించాలని మతపెద్దలు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు.

అదిత్యనాథ్ మాట్లాడుతూ, “మనం పండుగల సమయంలో పరస్పరం గౌరవించుకోవాలి. శుక్రవారం నమాజ్ ప్రతి వారం ఉంటుంది, కానీ హోలీ సంవత్సరం‌లో ఒక్కసారే వస్తుంది. నమాజ్ ఆలస్యంగా చేసుకోవచ్చు. ఎవరైనా ఖచ్చితంగా 1:30 గంటలకే నమాజ్ చేయాలనుకుంటే, వారు ఇంట్లోనే చేసుకోవచ్చు. మస్జిద్‌కు వెళ్లి నమాజ్ చేయడం తప్పనిసరి కాదు” అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Copyright © 2025 BY News Dada